Sunday, April 28, 2024

National : ఇవాళ భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు…

రాహుల్‌ గాంధీ చేప‌ట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఇవాళ ముంబయిలో ముగింపు కానుంది. ఈ సంద‌ర్భంగా ఎన్నికల శంఖరావం పూరించనుంది. విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఇవాళ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుండగా.. ముగింపు సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement