Friday, May 3, 2024

National : కేజ్రీవాల్‌ని వ‌ద‌ల‌ని ఈడీ…మ‌రోసారి స‌మ‌న్లు…

ఢిల్లీసీఎం కేజ్రీవాల్‌ను ఈడీ వ‌ద‌ల‌డం లేదు. మరోసారి ఆయ‌నకు నోటీసులు జారీచేసింది. మార్చి 21న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఇది ఆయ‌న‌కు తొమ్మిదోసారి ఈడీ స‌మ‌న్ల‌ను అందించ‌డం.

గత ఎనిమిది నోటీసులకు స్పందించని ఆయన విచారణకు గైర్హాజరవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. అప్పుడు విచారణ జరిపిన ధర్మాసనం ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన వర్చువల్గా కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ అంశం కోర్టులో పెండింగ్లో ఉండగానే కేజ్రీవాల్కు ఈడీ మళ్లీ సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించింది. ఈడీ అభియోగాలపై విచారించిన కోర్టు.. అవి బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లేనని పేర్కొంటూ కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. తాజాగా మరోసారి సమన్లు జారీచేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement