Sunday, May 5, 2024

అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌ ఈటల: మోత్కుపల్లి

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఫైర్ అయ్యారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్‌ ఈటల అని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్‌తో హుజూరాబాద్‌ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. హాస్టల్‌లో ఉండి చదువుకున్న ఈటలకు అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అవినీతి సొమ్మును భారీ ఎత్తున్న పంచుతున్నాడని ఆరోపించారు. ఉపఎన్నికలో ఈటల గెలిచినా చేసేదేమీ లేదన్నారు. హుజూరాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ నేతలు దళితబంధును ఎన్నిరోజులు ఆపగలరని ప్రశ్నించిన మోత్కుపల్లి… అన్ని వర్గాలకు దళితబంధు లాంటి పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి: మాదక ద్రవ్యాలకు కేంద్రంగా ఏపీ: పవన్

Advertisement

తాజా వార్తలు

Advertisement