Sunday, April 28, 2024

TS: మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ హస్తగతం..

మోత్కూర్, మార్చి 4 (ప్రభ న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 9న బీఆర్ఎస్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి మేఘారెడ్డిని గద్దె దింపిన 10మంది అసమ్మతి కౌన్సిలర్లు… సోమవారం మున్సిపల్ కార్యాలయంలో భువనగిరి ఆర్ డి ఓ అమరేందర్ ఎన్నికల అధికారి సమక్షంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికకు నేరుగా క్యాంప్ నుండి 11గంటలకు సమావేశానికి చేరుకున్నారు.

నూతన చైర్మన్ ఎన్నిక సందర్భంగా 11వ వార్డ్ కౌన్సిలర్ గుర్రం కవిత లక్ష్మినర్సింహ రెడ్డిని 1వ వార్డ్ కౌన్సిలర్ పురుగుల వెంకన్న చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదించగా, వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య బలపర్చడంతో మినహా 8 మంది కౌన్సిలర్లు చేతులెత్తడంతో గుర్రం కవిత చైర్మన్ గా ఎన్నికైనట్లు ఆర్ డి ఓ, ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆర్ డి ఓ అమరేందర్ నూతన చైర్మన్ కవితతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహశీల్దార్ డి రాంప్రసాద్ పాల్గొన్నారు.


కాంగ్రెస్ సంబరాలు.. సన్మానాలు..
మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన గుర్రం కవిత లక్ష్మినర్సింహ రెడ్డి ఎన్నిక కావడంతో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణా సంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నూతన చైర్మన్ దంపతులను పూలమాలలు, శాలువాలు, పూల మొక్కలు, బొకేలు అందజేసి పెద్దఎత్తున సన్మానించారు.

పోలీసు బందోబస్తు..

- Advertisement -

చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామన్నపేట సి ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణ లో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement