Friday, May 10, 2024

HYD : బి.యన్ రెడ్డి నగర్‌లో మార్నింగ్ వాక్ విత్ మధుయాష్కీ

ఎల్బీనగర్, నవంబర్ 11(ప్రభ న్యూస్)
బి.యన్ రెడ్డి నగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ శనివారం ఉదయం స్వామి వివేకానంద పార్క్ లో మార్నింగ్ వాక్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాలనీ వాసులతో, అడుగులో అడుగేస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ నడక కొనసాగించారు.

మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ, మాది పీపుల్స్ మేనిఫెస్టో, మీ సమస్యలను మా మేనిఫెస్టోలో పెడతాం. మీ సమస్యలను పరిష్కరించడమే నా యొక్క లక్ష్యం అన్నారు. సమయాభావం వల్ల ఎన్నికల ముందు ప్రతి ఇంటికి నేను రాలేకపోవచ్చు. రేపు మీ ఎమ్మెల్యేగా ప్రతి ఇంటికి వచ్చి మీ కాలనీ సమస్యలు అధికారుల సమక్షంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మన ఆరోగ్యం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ గంజాయి బ్యాచ్ నాయకుల బారి నుండి మన ఎల్బీనగర్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం, మనందరం కలిసి భాధ్యతగా ఎల్బీనగర్ ను లిక్కర్ ఫ్రీ, గంజా ఫ్రీ, కబ్జా ఫ్రీ,కరప్షన్ ఫ్రీ, కమీషన్ ఫ్రీ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement