Sunday, April 28, 2024

TS: వోల్వో బ‌స్సు ప్ర‌మాదంలో మొహ‌దీప‌ట్నం మ‌హిళ స‌జీవ‌ద‌హ‌నం

జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలం తెల్ల‌వారు జామున జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదంలో మ‌హిళ సజీవ దహ‌న‌మైంది. ఆ మ‌హిళ మొహ‌దీప‌ట్నంకు చెందిన మాల‌తి(40)గా పోలీసులు గుర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవల్లి మండలం పదవ బెటాలియన్ సమీపంలో జాతీయ రహదారిపై 34 మంది ప్రయాణికులతో హైదరాబాద్ మియాపూరు నుంచి కడపకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

వెంటనే మంటలు వ్యాపించడంతో.. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు బయటపడ్డారు. బస్సు పూర్తిగా దగ్ధమవగా.. బస్సులో చిక్కుకుని ఒక ప్రయాణికురాలు సజీవ దహనమైంది. ప్రయాణికులను పోలీసులు కర్నూలుకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement