Friday, May 17, 2024

ప్రధాని మోడీ పథకాలను ఇంటింటికి చేరవేయడమే లక్ష్యం : మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ టౌన్ ఆగస్టు 9 ప్రభా న్యూస్ )ఇంటింటికీ బీజేపీ బీజేపీ కార్యక్రమంలో బాగంగా బుధవారంనిర్మల్ పట్టణం లోని బేస్తవార్ పేట్, కాల్వగడ్డ కాలనీల్లో గడప గడప కు పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ చేస్తూన్నటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి . కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రైతులకు, పేద ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని,కరోనా సమయంలో వ్యాక్సిన్, ఉచిత రేషన్ బియ్యం ఇలాంటి అనేక విషయాలను మోడీ ప్రవేశపెడుతున్నారని ప్రజలకు తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా దేశంలో 3 కోట్ల కు పైగా ఇళ్లను నిర్మించ‌గా, అందులో తెలంగాణ రాష్ట్రానికి 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేశారని అన్నారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అక్రమాలు , అవినీతి , కబ్జాలపై ఉన్న శ్రద్ధ ప్రజల పట్ల లేదని యెద్దేవా చేశారు . స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అవినీతిని అరికట్టాలంటే నిర్మల్ లో బీజేపీ జెండా ఎగేరాయాలని , అందుకు ప్రతి ఒక్కరు బిజెపి విజ‌యానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు అయ్యన్న గారి భూమయ్య, మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్ రెడ్డి, వొడిసెల శ్రీనివాస్, వొడిసెల అర్జున్, కమల్ నయన్ , భూపతి రెడ్డి, సాదం అరవింద్, గాదె విలాస్, రాకేష్, నాని, శ్రీరమోజు నరేష్, మార గంగారెడ్డి,అల్లం భాస్కర్, భరత్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement