Thursday, May 16, 2024

సీఎంకు వంద‌సార్లు పాదాభివంద‌నం చేస్తాన‌న్న ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి

కేసీఆర్ చాలా ముందు చూపున్న వ్యక్తి అని, ఆయ‌న‌కి ఒక్కసారి కాదు వందుసార్లు పాదాభివందనం చేస్తానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంక‌ట్రామిరెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఇందిరాపార్క్‌ వద్ద చేస్తోన్న మహాధర్నా వ‌ద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ నాకు దేవుడుతో సమానం. తెలంగాణ ప్రజలకు తండ్రి సమానులు. నా పొలిటికల్ ఎంట్రీ పై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేస్తున్నాయి. అందరూ ముఖ్యమంత్రుల వద్ద పని చేశానంటే వాళ్ళు నన్ను, నా పని తనాన్ని మెచ్చుకుని పదవులు ఇచ్చారు. అందరు ముఖ్యమంత్రుల మన్ననలు పొందానంటే నేనేంటో తెలుసుకోవాలి. కేసీఆర్ పని విధానానికి ఆకర్షితుడినై టీఆర్ఎస్ లో చేరాను. కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటా. కలెక్టర్ పదవి వదిలి పెట్టి రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత రైతుల పక్షాన ఉద్యమం చేయడం సంతోషంగా ఉంది’ అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వెంక‌ట్రామిరెడ్డి మొన్నటి వరకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ఇటీవ‌లే ఎమ్మెల్సీ పదవిని పొందిన విష‌యం విదిత‌మే.

Advertisement

తాజా వార్తలు

Advertisement