Sunday, April 28, 2024

TS : రాజ్య‌స‌భ ఎంపీని స‌న్మానించిన ఎమ్మెల్సీ

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను శాసనమండలి సభ్యులు తక్కళ్లపల్లి రవీందర్ రావు మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ను పుష్పగుచ్ఛం, శాలువాతో సన్మానించి శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -

రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై ఇటీవల పదవీ ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఎంపీ వద్దిరాజు మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తూ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా రవీందర్ రావు లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్సీ,మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తదితర ప్రముఖులతో కలిసి శాలువాతో ఎంపీ రవిచంద్రను సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement