Sunday, April 28, 2024

National : జమ్ము కశ్మీర్‌లో పడవ బోల్తా.. నలుగురి మృతి

జమ్ము కశ్మీర్‌లోని జీలం నదిలో బోటు ప్ర‌మాదం జ‌రిగింది. మంగళవారం ఉదయంలో ముజఫర్‌ నగర్‌ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.

- Advertisement -

గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్‌ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది.

ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్‌ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement