Friday, April 26, 2024

సీఎస్ ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాతృమూర్తి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. అయితే ఈరోజు సోమేష్ కుమార్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని సోమేష్ కుమార్ నివాసంలో మినాక్షి సింగ్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంత‌రం ఎమ్మెల్సీ క‌విత వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement