Friday, May 3, 2024

పోరాటం వల్లే తెలంగాణ సాకారం: మోదీకి కవిత కౌంటర్

రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు.  పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమ నిరసన తెలియజేస్తున్నాం అని అన్నారు. రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటం వల్లే తెలంగాణ సాకారమైందని చెప్పారు. ప్రజల చిత్తశుద్ధి, విశ్వాసమే తెలంగాణ ఏర్పాటులో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చేలా చేసింది అని చెప్పారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపి పార్టీ దిష్టిబొమ్మల దహనం చేయాలని,నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ శ్రేణులను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement