Sunday, April 28, 2024

TS: రేపు పెద్ద‌ప‌ల్లిలో ఎమ్మెల్సీ కవిత ప‌ర్య‌ట‌న..

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం పెద్దపల్లికి రానున్నారు. సాయంత్రం 6 గంటలకు జెండా కూడలిలో నిర్వహించే కార్నర్ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇందుకోసం ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పట్టణ ప్రజలతో పాటు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే దాసరి కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement