Thursday, May 2, 2024

TS: వెంక‌ట్ కుటుంబానికి క‌విత ప‌రామ‌ర్శ‌..

నిజామాబాద్‌ : విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో నిన్న బోధన్ బీసీ హాస్టల్‌లో మరణించిన హర్యాల వెంకట్ కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్‌తో కలిసి పరామర్శించారు. జిల్లాలోని గాంధారి మండలం తిప్పారం తండాకు చేరుకున్న చేరుకున్న కవిత వెంకట్‌ సభ్యులను క‌లిశారు.

అనంతరం వెంకట్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. కవిత బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా క‌విత మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ హాస్టళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబంలో ‌ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement