Thursday, May 16, 2024

మౌలిక సదుపాయాల కల్పనలో ఎల్బీనగర్ ముందంజ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

నాగోల్ అగస్ట్ 27 (ప్రభ న్యూస్) ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన లో ఎల్బీనగర్ నియోజకవర్గం ముందంజ లో ఉందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. నాగోల్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీ సంక్షేమ సంఘల సభ్యుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా సుధీర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా కాలనీవాసులు సుధీర్ రెడ్డిని సన్మానించారు.పలువురు కాలనీవాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇప్పటికే ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు.ఇంక కొన్ని చిన్న,చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. వాటిని కూడా పరిష్కారం చేయాలని కోరారు.దానిలో భాగంగా కొన్ని కాలనీల లో సీ.సీ.కెమేరాలు ఏర్పాటు, అంతర్గత రోడ్లు నిర్మాణం, డ్రైన్స్ వ్యవస్థ చిన్నగా ఉంది వాటి స్థానంలో పెద్ద లైన్స్ వేయాలని కోరారు.అలాగే కరెంటు స్తంభాలు,నూతన ట్రాన్స్ఫార్మర్స్,నూతన పార్కులు నిర్మించాలని,సీనియర్ సిటీజన్ల కోసం భవనాలు నిర్మించాలని వివరించారు.అలాగే సర్వీస్ రోడ్లు వెడల్పు చేయాలని,మన్సూరాబాద్ నుంచి సుష్మ రోడ్డు వెడల్పు చేయాలని కోరారు.అవసరం ఉన్న చోట్ల రోడ్డు వెడల్పు పనులు చేయాలన్నారు.

.అనంతరం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగోల్ డివిజన్ లో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిగిలిన 15 శాతం పనులు,మీరు వివరించిన సమస్యలను రాసుకున్నామని సాధ్యమైనంత త్వరితగతిన విడతల వారిగా పూర్తి చేస్తామని హమీ ఇచ్చారు.

.ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు చిరంజీవి,సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి,మహిళా అధ్యక్షురాలు ప్రమీల,సీనియర్ మహిళా నాయకురాలు రంగేశ్వరి,శిల్ప,నాయకులు గణేష్ యాదవ్,సతీష్ యాదవ్,జంగయ్య గౌడ్,మైసయ్య,రాములు గౌడ్,సీతారాం,ఈశ్వరయ్య,సుధాకర్,శరత్ రెడ్డి మరియు వివిధ కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement