Friday, May 3, 2024

సీఎం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవ సహకార అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో దళిత బందు లబ్ధిదారుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లబ్ధిదారులు దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ మీ ఎంచుకున్న యూనిట్ ద్వారా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అని భేదం లేకుండా ఎలాంటి వివక్షత లేకుండా తమ నియోజక వర్గానికి 100 మంది లబ్దిదారుల ఎంపికకు సహకరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి, ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ములుగు నియోజకవర్గానికి ఇంకా 2000 వేల మంది దళితులకు దళిత బందు ఇవ్వాలని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా,మండల అధికారులు జెడ్పీటీసీలు ఎంపీపీలు, ప్రజాప్రతినిధిలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement