Sunday, May 5, 2024

మేడారం జాతరపై సీఎస్ కు కలిసిన సీతక్క

మేడారం జాతరకు సంబంధించిన విషయమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని ములుగు ఎమ్మెల్యే సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సంరద్భంగా మేడారం జాతరకు 112 కోట్లు కేటాయించాలని కోరారు. మేడారం జాతర పనుల పై దృష్టి సారించి.. అభివృద్ది  పనులు చేపట్టాలని తెలిపారు. కోటి మంది వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. మేడారం సమస్యలకు సంబంధించి ఎమ్మెల్యే సీతక్క సీఎస్ కు లేఖ అందించారు.

ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ ములుగు జిల్లా కలెక్టర్ గారు వివిధ శాఖల నుండి మేడారం జాతర అభివృద్ధికి సుమారు రూ.112 కోట్లతో ప్రణాళిక రూపొందించి రాష్ట్ర  ప్రభుత్వానికి పంపారని తెలిపారు.  రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరకు 111 కోట్ల 91 లక్షల రూపాయలు  నిధలు తక్షణమే కేటాయించి నాణ్యతతో కూడిన పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: LPG Cylinder: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!

Advertisement

తాజా వార్తలు

Advertisement