Monday, April 29, 2024

తుమ్మ‌ల‌ టార్గెట్ గా ఎమ్మెల్యే సండ్ర వ్యాఖ్య‌లు..

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ… అహంభావంతో తాను ఎక్కడా పని చేయలేదన్నారు. కొంతమంది తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడైనా సత్తుపల్లిలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. సత్తుపల్లికి రూ.60 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు. ముసుగు తొల‌గించి రాజ‌కీయం చేయాల‌ని సూచించారు. స‌త్తుప‌ల్లి ప్ర‌జ‌లు విజ్ఞుల‌ని, మీ ఆట‌లు సాగ‌వ‌న్నారు. అప్పుడు టీడీపీలో ఉన్న‌ప్పుడు ఇబ్బంది పెట్టారు.. ఇప్పుడు టీఆర్ఎస్ లో మ‌రోలా ఇబ్బంది పెడుతున్నార‌ని సండ్ర వెంక‌ట వీర‌య్య అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement