Wednesday, May 1, 2024

పోడు రైతుల‌కు ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ ప‌ట్టాలు పంపిణి..

జన్నారం, జు లై 5(ఫభన్యూస్):మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 299 మందికి పోడు భూముల పట్టా లను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. స్థానిక పైడిపల్లి ఫంక్షన్ హాల్లో బుదవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభత్వ ధ్యేయమన్నారు. ఆతర్వాత కల్యాణలక్ష్మి చెక్కులను ఆమె అంద జేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఆర్డీవో వేణు,ఎం పిపి సరోజన, తహసీల్దార్ కిషన్, నేతలు వినయ్ కుమార్, రాజారామ్ రెడ్డి, భూమేష్, జనార్ధన్, భరత్ కుమార్, సతీష్, మూన్వర్, కాంతామణి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement