Sunday, April 28, 2024

విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్

పేట్ బ‌షీరాబాద్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.

స్వామి వారి కృప ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement