Thursday, May 2, 2024

సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్న‌ ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని నడిగడ్డ తాండా సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి నడిగడ్డతాండ బీజేపీ నేతలు, తాండా వాసులతో కలిసి ఆయన నివాసంలో దాదాపు అరగంట సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో శాశ్వత పరిష్కారం చూపాలనే చర్చ జరిగినపుడు, నివసిస్తున్న వారికి వత్తిడి తగ్గించే విధంగా చూడాల్సిన అవసరాన్ని గుర్తించానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో దేవనూరి చందు, ఎడ్ల ఆంజనేయులు, రాథోడ్ రవీందర్ నాయక్, ఆర్టీసీ ఈశ్వర్, సోమేష్ కుమార్, సిబి శివ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttps://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement