Monday, April 29, 2024

కరోనా సోకినా అగని ప్రజా పర్యవేక్షణ

కరోనా సోకినప్పటికీ ప్రజా పర్యవేక్షణ మాత్రం ఆగ లేదు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల బాగోగులు చూసుకునే పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి కరోన పాజిటివ్ వచ్చింది. అయినప్పటికీ ప్రజలను చూసుకోవడం మాత్రం విస్మరించలేదు. హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతూనే ఫోన్ లో అందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఏ సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రజలు సమస్యలు చెప్పగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యను వెంటనే పరిష్కరిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేనప్పటికీ ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్న దాసరి అసలైన ప్రజాప్రతినిధి అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement