Thursday, April 25, 2024

ఆర్మీకి 117 ఎకరాల భూమి విరాళం.. క్లారిటీ ఇచ్చిన సుమన్

ఇండియన్ ఆర్మీకి సినీ నటుడు సుమన్ 117 ఎకరాల భూమిని విరాళం ఇచ్చినట్టు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని సుమన్ స్పష్టం చేశారు. వాటిని ఎవరూ నమ్మవద్దు అని కోరారు. ఆ భూమికి సంబంధించి వివాదం కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. వివాదానికి పరిష్కారం లభించిన వెంటనే వ్యక్తిగతంగా తానే అందరికీ తెలియజేస్తాను అని తెలిపారు. దానికి సంబంధించి ఏ విషయమైనా తానే చెబుతానని సుమన్ స్పష్టం చేశారు.

కాగా, తెలంగాణలోని యాదాద్రి సమీపంలోని 117 ఎకరాల భూమిని భారత సైన్యానికి అలనాటి ఛార్మింగ్ హీరో సుమన్‌ విరాళంగా ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నట్టు సుమన్ పై వార్తలు హోరెత్తుతున్నాయి. ఈ భూమిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆర్మీకి అప్పగించనున్నట్టు కథనం వచ్చాయి. 1990లో సుమన్‌ ఈ భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement