Monday, May 6, 2024

ప్రాణాలు కాపాడిన దేవుడు ఎమ్మెల్యే దాసరి

వరద నీటిలో చిక్కుకున్నామని ఫోన్లో తమ బాధను చెప్పగానే సంఘటన స్థలానికి చేరుకుని గజఈతగాళ్ళ తో కాపాడిన దేవుడు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అని ముత్తారం గ్రామానికి చెందిన చాట్ల రమేష్ కుటుంబం పేర్కొన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం రంగంపల్లి లోని సాయి ఫంక్షన్ హాల్ లో వరద నీటిలో చిక్కుకున్నామని ముత్తారం గ్రామానికి చెందిన చాట్లస్వప్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఫోన్ లో సమాచారం అందించింది. తనతో పాటు భర్త రమేష్, కూతుర్లు విష్ణుప్రియ, సాయి కృతిక లు వరద నీటిలో చిక్కుకున్నామని సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గజ ఈతగాళ్లను పిలిపించి తెప్పల సహాయంతో బాధిత కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్షేమంగా తిరిగి వచ్చిన బాధిత కుటుంబం నీటిలోనే తమ ప్రాణాలు కోల్పోయామని భావించామని, ఎమ్మెల్యే తమకు ప్రాణ బిక్ష పెట్టారని పేర్కొన్నారు. తమ కుటుంబం ఎప్పటికీ ఎమ్మెల్యేకు రుణపడి ఉంటామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement