Sunday, May 19, 2024

ఏఈ పోస్టుల ఫలితాలు విడుదల..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ శాఖల్లోని పలు ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలో ప్రొవిజినల్‌గా ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ప్రకటించింది.

మొత్తం 190 ఖాళీల భర్తీ కోసం 361 మంది అభ్యర్థులను ఆహ్వానించినట్లు కార్యదర్శి వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉదయం పది గంటలకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని సూచించారు. అభ్యర్థులు ఏ రోజు రావాలనే వివరాలు కమిషన్‌ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అభ్యర్థులు మెమో, చెక్‌ లిస్టులు, అటెస్టేషన్‌ ఫారంలను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement