Tuesday, May 7, 2024

108 అంబులెన్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆగస్టు 3 (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక 108 అంబులెన్స్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం వికారాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతుబంధు అధ్యక్షులు రామిరెడ్డి వికారాబాద్ పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లు గోపాల్, రామస్వామి ఉపాధ్యక్షులు బూరుగుపల్లి అనంతరెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మూల రాజ్ కుమార్, కైలా ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement