Saturday, May 4, 2024

అదృశ్య‌మైన విద్యార్థుల ఆచూకీ ల‌భ్యం

అదృశ్య‌మైన ముగ్గురు విద్యార్థుల క‌థ సుఖాంత‌మైంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ముగ్గురు విద్యార్థులు అదృశ్య‌మ‌య్యారు. పటాన్ చెరు గౌతంనగర్‌ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులు రాహుల్ (8వ త‌ర‌గ‌తి), విక్రమ్ (నాల్గ‌వ తరగతి), ప్రీతమ్ (నాల్గ‌వ‌ తరగతి) చదువుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావ‌డంతో వారి త‌ల్లిదండ్రులు అర్థరాత్రి దాటాక‌ పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుపై పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్ప‌డి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఆ విద్యార్థుల‌ను పోలీసులు ప‌ట్టుకోగ‌లిగారు. పాడుబడిన పటాచ్ చెరు రైల్వేస్టేషన్ సమీపంలో రాత్రి అంతా గడిపిన‌ ఆ విద్యార్థులు పోలీసులకు దొరికిపోయారు. విద్యార్థుల‌ను ప‌ట్టుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో ఈ కథ సుఖాంతమైంది. ఆ విద్యార్థుల‌కు చ‌దువుపై ఇష్టం లేక‌నే ఇలా చేశారని తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement