Tuesday, May 21, 2024

RR | కనిపించకుండా పోయిన తల్లి, కొడుకు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మామ

శంకర్‌ప‌ల్లి, (ప్రభన్యూస్): తల్లితో పాటు ఆమె కుమారుడు కనిపించకుండా పోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జ‌రిగింది. శంకర్‌పల్లి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గాజులగూడ గ్రామానికి చెందిన సార అనురాధ(25), తన ఐదేండ్ల‌ కుమారుడిని తీసుకొని ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇవ్వాల (మంగళవారం) ఉదయం బయటికి వెళ్లింది.

ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబస‌భ్యులు చుట్టుపక్కల వెతికారు. అనురాధ తన తల్లి గారి ఇంటికి పోయిందేమో అని, అక్కడి కూడా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇక‌.. చేసేదేమీ లేక అనురాధ మామ సారా వెంకన్న శంకర్‌ప‌ల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై సంతోష్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement