Saturday, May 18, 2024

16 నుంచి మైనార్టీ బంధు నిధులు పంపిణి….హ‌రీష్ రావు

హైద‌రాబాద్ – మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు అధికారుల‌ను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల 16 నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ మేర‌కు నిధుల‌ను ఆర్ధిక శాఖ విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement