Sunday, May 19, 2024

వ‌న‌దుర్గ మాత‌ను ద‌ర్శించుకున్న మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏడుపాయల్లో వనదుర్గ మాతను దర్శించుకున్నారు. ఈసంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ… మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతుందన్నారు. ఏడుపాయల దుర్గామాత దేవాలయంకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులు కేటాయించారన్నారు. గత ప్రభుత్వాలు ఏడుపాయలను పూర్తిగా విస్మరించాయన్నారు. భక్తులకు సకల సదుపాయాలుండాల‌న్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సౌజన్యంతో ఏడుపాయల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఏడాదికేడాది ఏడుపాయల అభివృద్ధి చెందుతుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement