Wednesday, May 1, 2024

RK బీచ్ విషాదం.. మృతుల కుటుంబాలకు మంత్రి తలసాని ఆర్థిక సహాయం

విశాఖలోని RK బీచ్ లో గల్లంతై మృతి చెందిన తెలంగాణ యువకుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. విహార యాత్ర కోసం స్నేహితులతో కలిసి విశాఖపట్నం వెళ్ళి అక్కడి RK బీచ్ లో రసూల్ పురాకు చెందిన శివ, శివ కుమార్, అజీజ్ అనే ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను వారి నివాసాలకు తీసుకొచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున మూడు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మృతులు ముగ్గురు అతి చిన్న వయసు కలిగిన వారని, నిరుపేద కుటుంబాలకు చెందిన వారని అన్నారు. ఈ సంఘటన చాలా బాధాకరం అని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ సహాయం అందించి ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న,  మాజీ వైస్ చైర్మన్ జక్కుల మహేశ్వర్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement