Thursday, May 2, 2024

బైక్ ర్యాలీని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

ప్రభ న్యూస్ ప్రతినిధి, ములుగు : ములుగు జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో నిర్వహించనున్న ప్రతినిధుల ఫ్లీనరీకి మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గట్టమ్మ టెంపుల్ వద్దకు చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గట్టమ్మ ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీని బీఆర్ఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి సభ స్థలానికి బయలుదేరారు. వారి వెంట ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్, గ్రంధాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇతర ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement