Saturday, April 27, 2024

మంత్రి పువ్వాడ అజయ్ ని వెంటనే బర్తరఫ్ చేయాలి : బీజేపీ ఎంపీ

కార్యకర్త మరణానికి కారణమైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను వెంటనే బర్త రఫ్ చేయాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు. తాజాగా ఈరోజు సాయి గణేష్ కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… మంత్రిని, కార్పోరేటర్ భర్తను కూడా అరెస్ట్ చేయాలని … కేసీఆర్ ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త‌మ కార్యకర్త ఎదుగుదలను చూడలేక అతన్ని అనేక రకాలు హింసించారని… 16 కేసులు పెట్టి, రౌడీ షీట్ పెట్టి, మూడు సార్లు జైలుకు పంపి… ఆత్మహత్య చేసుకునే విధంగా ఒత్తడి చేయడం వల్లే చనిపోయారని ఆరోపించారు. సాయి గణేష్ కు ఆత్మశాంతి కలగాలంటే మంత్రి పువ్వాడతో పాటు కార్పొరేటర్ భర్తపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. చనిపోయిన తర్వాత కూడా పోలీసులు కేసులు పెట్టడం లేదని ఆరోపించారు. అతను రికార్డ్ సెల్పీ వీడియో ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement