Wednesday, May 15, 2024

Khammam – మళ్లీ గెలిపిస్తే .. మరింత అభివృద్ధి చూపిస్తా…! – మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం : ఖమ్మం నగరం 18వ డివిజన్ శ్రీరాం హిల్స్ లో మున్సిపల్ సాధారణ నిధులతో ఎర్పాటు చేసిన పార్క్, ఓపెన్ జిమ్, సీసీ రోడ్స్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం శ్రీరాం హిల్స్ అసోసియేషన్ అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు. మళ్ళీ గెలిపిస్తే మిగిలి ఉన్న పనులు సమగ్రంగా పూర్తి చేస్తామని, మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఒకప్పుడు నగరానికి దూరం ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలని నేడు నగర నడి బొడ్డుగా మారిందన్నారు. అది కేవలం ఇక్కడ జరిగిన అభివృద్దే కారణమని, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్, రోడ్డు విస్తరణ, దంసలాపురం ఆర్ ఓ బి ప్రధాన కారణమన్నారు. ఇంత ప్రగతి సాధ్యం అయింది అంటే అది బీ ఆర్ ఎస్ ప్రభుత్వం వల్లే వేల కోట్ల నిధులు తీసుకురాగలిగా మన్నారు.

ఇంకా తెస్తాం. మీరందరూ మళ్ళీ బీ ఆర్ ఎస్ ప్రభుత్వంను ఆదరించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. సిఎం కేసీఅర్ ని హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చెయ్యాలన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులు.. మీరు అనుకుంటే అయిపోతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ మందడపు లక్ష్మీ మనోహర్, కమర్తపు మురళీ, మేడారపు వెంకటేశ్వర్లు, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణా రావు, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, ఎసిపి గంటా వెంకట్రావు, జి శ్రీనివాస్, కాటా సత్యనారాయణ బాబ్జీ, కమర్తపు సరిత, సుజాత, రైస్ మిల్లర్లస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వర రావు, శ్రీరాం హిల్స్, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement