Friday, May 3, 2024

Minister Ponguleti – గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తా – మంత్రి పొంగులేటి

హనుమకొండ: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.. శనివారం నాడు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌పై మేజర్‌గా, డబుల్ బెడ్రూం ఇళ్ల పరిస్థితిపై కూడా చర్చించామన్నారు..

మేడారం మహాజాతరకు 105కోట్లు ఇస్తున్నామన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వానిది ఆర్భటాలు మాత్రమేనని.. వ్యక్తిగత లాభం కోసమే పనులు చేశారని మండిపడ్డారు. నాడు మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు. భూ కబ్జాలపై చర్చించినట్లు చెప్పారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం కాకుండా చూస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement