Friday, April 26, 2024

ఈ నెల 23న హ‌నుమ‌కొండ‌లో ప‌ర్య‌టించ‌నున్న మంత్రి కేటీఆర్

హనుమకొండ జిల్లా- 23న ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ హ‌నుమ‌కొండ‌లో పర్య‌టించ‌నున్నారు.ఈ సంద‌ర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయలు ప్రారంభం చేయ‌నున్నారు. గ్రౌండ్ లో భారి బహిరంగ సభ జ‌ర‌గ‌నుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ..బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. సీబీఐ ..ఈడీ.. ఐటీ బీజేపీ జేబుసంస్థలుగా మారాయి.దేశ సంపదను దోచుకుంటున్న అంబానీ అదానీలపై ఈడీ.. సీబీఐ ..ఐటీ దాడులు చేయాలి.మహిళా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న ఎమ్మెల్సీ కవితను ఈడీతో బెదిరిస్తున్నారు.కవితను ఇబ్బందిపెడితే దేశప్రజలు, తిరగబడుతారు.బాలవికాస లాంటి స్వచ్ఛంద సంస్థలపై కూడా రైడ్స్ చేయించటం బాధాకరం.ప్రజాసమస్యలపై పోరాడటంలో బీఆరెస్ ఎల్లప్పుడూ ముందుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement