Thursday, April 25, 2024

వైసిపి ఎంపి మాగుంట‌కు ఈడీ పిలుపు ..

న్యూఢిల్లీ – లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈ నెల 18 వ తేదిన విచార‌ణ‌కు రావ‌ల‌సిందిగా వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాస‌రెడ్డికి ఈడీ నేడు నోటీసులు జారీ చేసింది.. విచార‌ణ‌కు స్వ‌యంగా హాజ‌రుకావ‌ల‌సిందిగా పేర్కొంది..కాగా,ఈ కేసులో ఇప్ప‌టికే మాగుంట కుమారుడు రాఘ‌వ ను అరెస్ట్ చేశారు.. తాజాగా శ్రీనివాస‌రెడ్డిని కూడా ఈడీ నోటీసులు జారీ చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగించింది.. ఇది ఇలా ఉంటే ఈ కేసులో నిందితుడు రామ‌చంద్ర పిళ్ళై క‌స్ట‌డీ నేటితో ముగియ‌డంతో కోర్టులో హాజ‌రుప‌రిచారు.. ఆయ‌న క‌స్ట‌డీని మ‌రో అయిదు రోజులు పొడిగించాల్సింగా ఈడీ త‌రుపు న్యాయ‌వాదులు కోరారు.. నేటి విచార‌ణ‌కు క‌విత హాజ‌రు కాక‌పోవ‌డం, ఆమెతో క‌ల‌సి పిళ్లైని విచారించాల్సి ఉంద‌ని కోర్టు దృష్టికి తెచ్చారు..దీంతో మరో అయిదు రోజులు క‌స్ట‌డీ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు.. ఇదే సందర్బంగా కవిత ఈ కేసులో అనుమానితురాలని కోర్టుకు విన్నవించింది ఈడి.

Advertisement

తాజా వార్తలు

Advertisement