Monday, April 29, 2024

బీసీ స్టడీ సర్కిల్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కరీంనగర్ లో ని ఐటి టవర్ సమీపం లో 5 కోట్ల రూపాయలతో నిర్మించిన బి సి స్టడీ సర్కిల్ ను ఇవ్వాల ప్రారంభించారు. ఈ సందర్బంగా విద్యారుతాల‌తో ఆయ‌న‌ ఇంట్రాక్ అయ్యారు. అనంత‌రం ఐటీ టవర్ లో కరీంనగర్ నగర మేయర్, కొత్తపల్లి , చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్ల‌తో కలసి మున్సిపాలిటీల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి వెంట మంత్రి గంగుల కమలాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మేయర్ సునీల్ రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి , డెప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశనకర్, కలెక్టర్ కర్ణన్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement