Tuesday, April 30, 2024

TS: 1న పెద్ద‌ప‌ల్లి ప‌ర్య‌ట‌న‌కు మంత్రి కేటీఆర్.. రూ.35.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు

రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు అక్టోబర్ ఒకటో తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. 25 కోట్ల రూపాయల టియుఎఫ్ఐడిసి నిధుల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, 10 కోట్ల రూపాయల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో నిర్మించనున్న పనులకు శంకుస్థాపనలు, 50 లక్షల రూపాయల పట్టణ ప్రగతి నిధులతో నిర్మించిన, నిర్మించనున్న జంక్షన్ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

అనంతరం జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేటీఆర్ పర్యటన కోసం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏర్పాట్లను ప్రారంభించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement