Sunday, April 28, 2024

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ కష్టాలకు చెక్.. బాలానగర్ ఫ్లైఓవర్ సిద్ధం!

హైదరాబాద్ నగర వాసులకు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యంత ట్రాఫిక్ సమస్య కలిగిన ప్రాంతాల్లో ఒకటైన బాలానగర్ లో కొత్త బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యింది. బాలానగర్ ప్రాంతంలో వందలాది పరిశ్రమలు ఉండటంతో అనునిత్యం వేలాది ఆటో ట్రాలీలు, లారీలు తిరుగుతుంటాయి. దీంతో విపరీతంగా ట్రాఫ్ జామ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వాహనదారుల కష్టాలకు చెక్ పెట్టేందుకు 2017లో బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 385 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు మూడున్నర ఏళ్ల వ్యవధిలో పూర్తయ్యాయి.
 
మొత్తం 1.13 కి.మీ పొడవున్న ఈ ఫ్లై ఓవర్ ను 24 మీటర్ల వెడల్పు, 26 పిల్లర్లతో నిర్మించారు. ఆరు లేన్లతో నగరంలో నిర్మించిన తొలి ఫ్లై ఓవర్ ఇదే కావడం విశేషం. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే బాలానగర్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలు తప్పనున్నాయి. 2050 సంవత్సరం వరకు ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని దీన్ని నిర్మించారు. ఈ ఫ్లై ఓబర్ ను రేపు కేటీఆర్ ప్రారంభించబోతున్నారు. ఈ బ్రిడ్జికి బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ గా నామకరణం చేయనున్నారు. కాగా, నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు లింక్ రోడ్లు ప్రభుత్వం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: బ్రిటన్ అన్ లాక్.. మాస్కులు ధరించడం ఇక ప్రజల ఇష్టం!

Advertisement

తాజా వార్తలు

Advertisement