Sunday, April 28, 2024

ఎవర్నీ వదిలిపెట్టొద్దు, నిందితులను తక్షణమే అరెస్టు చేయండి.. హోంమంత్రి, డీజీపీలకు మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ పబ్‌కు వచ్చిన 17 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగిందన్న ఘటనపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. అత్యాచార ఘటనలో ఎంతటి పెద్ద వారున్నా వదలొద్దని ట్వీట్‌ చేశారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిసి నిర్ఘాంతపోయానని ఆయన పేర్కొన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిలను ఆదేశించారు. ఘటనకు కారకులెవరైనా ఉపేక్షించవద్దని, హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా వదిలి పెట్టవద్దన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నిష్పక్షపాత విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement