Saturday, May 18, 2024

NLG: సాయినాధుని సేవలో మంత్రి జగదీష్ రెడ్డి

చింతపల్లి, సెప్టెంబర్ 9, (ప్రభ న్యూస్) : చింతపల్లి మండల కేంద్రంలో అపర శిరిడిగా విరాజిల్లుతూ, భక్తుల సహాయ సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతున్న సాయి సన్నిధి (సాయి బాబా దేవాలయం) లో నూతనంగా నిర్మించిన సాయికృష్ణ గోకులంను ప్రారంభించడానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యతిథిగా విచ్చేసి సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ చైర్మన్ మంచికంటి ధనుంజయ, ఆలయ అర్చకులు వారికి పూర్ణకంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ చైర్మన్ సాయినాధుని శాలువాతో సత్కరించి సాయినాధుని వస్త్రాన్ని మంత్రికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్, మునుగోడు శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి, మునుగోడు మాజీ శాసనసభ్యులు యాదగిరిరావుతో పాటు ట్రస్టు సభ్యులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement