Saturday, May 4, 2024

ADB: పూలజీ బాబా జన్మదిన వేడుకల పోస్టర్లను విడుదల చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

జైనూర్, ఆగస్టు 25 (ప్రభ న్యూస్) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ లోని సిద్దేశ్వర సంస్థన్ లో ఈనెల 30న శ్రీ సద్గురు పూలజీ బాబా 99వ జన్మదిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని దేవాదాయ, న్యాయ, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి శుక్రవారం మంత్రి నివాసంలో సిద్దేశ్వర్ సంస్థాన్ ఆద్యుక్షుడు కేశవ్ రావ్ ఇంగిలే కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రం అందించారు.

ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీ చైర్మన్ ఈశ్వర్ చేతుల మీదుగా బాబా జన్మదిన కరపత్రాలు విడుదల చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని తెలిపారని సిద్దేశ్వర సంస్థన్ అధ్యక్షులు ఇంగిలే కేశవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దేశ్వర్ సంస్థాన్ ఆద్యుక్షుడు కేశవ్ రావు ఇంగిలే, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, సిద్దేశ్వర సంస్థాన్ కమిటీ కార్యదర్శి దుక్రే సుభాష్, ఆంధ్ సంఘం నాయకులు జాడకే పాండురంగ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement