Thursday, May 16, 2024

TS: ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శంకుస్థాప‌న‌లు

కుమురం భీమ్ జిల్లా: అటవీశాఖ మంత్రి అండ్ దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి కుమురం భీమ్ జిల్లా జిల్లాలోని సిర్పూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమిపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రికి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ సైనికులు సిర్పూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని అచ్చెల్లి – చింతకుంట బ్రిడ్జి, శివపూర్ – హీరపూర్ బ్రిడ్జిని, పాతట్లగూడ బ్రిడ్జిలను ప్రారంభించారు. అలాగే శివపూర్ – హీరపూర్ రోడ్డుకు, మన్నేవార్ సంఘం భవనంకు కొబ్బరి కాయ కొట్టి భూమిపూజ చేశారు.

ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్ హేమంత్ బోర్కడే సహదేవరావు, ఎమ్మెల్సీ దండే విఠల్, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కోండ్ర జగ్గా గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్, ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement