Friday, May 3, 2024

నిర్మల్ లో జిల్లా ఆస్పత్రి నిర్మాణం.. ప్రారంభించనున్న మంత్రి హరీష్

నిర్మల్ లో కొత్తగా జిల్లా ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య  సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో 250 పడకల ఆసుపత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు.  మార్చి 3న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావుతో కలిసి భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ  ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కు విన్నవించామన్నారు. ప్రతిపాదిత మెడికల్ కాలేజ్ కు అనుమతి వచ్చిన వెంటనే… ఇదే స్థలంలో  కాలేజ్ భవన నిర్మాణం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement