Friday, April 26, 2024

తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

ప్ర‌త్యేక‌ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రక్రియకు పునాది అయిన 2009, డిసెంబర్‌ 9.. తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టిన దీక్షా దక్షుడి నాయకత్వంలో.. ఉద్యమం విజయ తీరాలకు చేరిన రోజని గుర్తు చేశారు. ఉద్యమ వీరుని ప్రస్థానానికి నేటి పన్నెండేండ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ మేరకు హరీష్ ట్వీట్‌ చేశారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో నినాదంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ 2009, నవంబర్‌ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యమ తీవ్రత రోజురోజుకు అధికమవుతుండటంతో.. డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబ‌రు 9నే ఈ ప్రకటన వెలువడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement