Friday, May 17, 2024

నిమ్స్ డైరెక్ట‌ర్ ను ప‌రామ‌ర్శించిన మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు నిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌నోహ‌ర్‌ను ఈరోజు ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌లే డాక్ట‌ర్ మ‌నోహ‌ర్ గుండెపోటుకు గుర‌య్యారు.. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉండ‌డంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఆరోగ్య వివ‌రాల‌ను మంత్రి హ‌రీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ డైరెక్ట‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మంత్రి హ‌రీశ్ రావు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement