Sunday, May 19, 2024

తొర్రూరు పట్టణంలో అభివృద్ధి జాతర

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మున్సిపాలిటీలోని 16 వార్డుల్లో ప్రతి వార్డు కనీసం 50 లక్షల చొప్పున నిధులతో సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువల పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. వార్డుల వారీగా వాడవాడలా పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కి పుష్పాభిషేకం చేస్తూ, మేళతాళాలు, కోలాటాలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు TRSలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కౌన్సిలర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఇతర సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement