Sunday, May 5, 2024

Nizamabad -ఎంఐఎం కౌన్సిలర్లకు బెయిల్ – జైలు నుంచి విడుదల

నిజామాబాద్ సిటీ జూలై (ప్రభా న్యూస్) 12:బోధన్ ఎమ్మెల్యే షకీల్, వారి అనుచరులు పై హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన ఎంఐఎం కౌన్సిలర్లకు బెయిల్ మంజూరు అయింది. బుధవారం నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ లో గల జిల్లా జైలు వద్ద బేయిల్ మంజూరై బయటకు వచ్చిన ఎంఐఎం కౌన్సిలర్లు ఆల్తాఫ్, నవీద్ రజ లను, నగర డిప్యూటీ మేయర్ ఇద్రిష్ ఖాన్, ఎంఐఎం జిల్లా అధ్యక్షులు షకీల్,తో పాటు పలువురు నాయకులు స్వాగతం పలుకుతూ పూలమాలలతో సన్మానించారు.

. ఈ సందర్భంగా ఎంఐఎం నాయకులు మాట్లాడుతూ. గత నెల బోధన్ పట్టణ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే షకీల్ ను అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఇద్దరు కౌన్సిలర్ల పై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపడం సిగ్గుచేటనీ మండిపడ్డారు. ఇకపై పట్టణ అభివృద్ధి కై పోరాడుతామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement