Sunday, April 28, 2024

కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షలు..

కరోనా సమయంలో విధులను నిర్వహిస్తూ మహమ్మారి బారిన పడి మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి అండగా నిలబడింది. కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమి తరఫున రూ. 2 లక్షల  ఆర్థిక సహాయాన్ని ఈ నెల 15న ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

అంతేకాదు, ఈ ఏడాది మార్చి నుండి డిసెంబర్ వరకు 7 నెలల కాలంలో ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు లక్షల రూపాయల చెక్కుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో జర్నలిస్టులను ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు అల్లం నారాయణ కృతజ్ఞతలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement